నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఉల్లాస్ – అక్షర ఆంధ్ర’ కార్యక్రమ గోడ పత్రికలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం విడుదల చేశారు.
మదనపల్లె కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్’ (ULLAS) ద్వారా 15 ఏళ్లు పైబడిన వారికి ప్రాథమిక విద్య అందించి, 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
