జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘అక్షరాంధ్ర’ పరీక్షలకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి, అభ్యాసకులను పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. శతశాతం హాజరు సాధించడం ద్వారా జిల్లాను అక్షరాస్యతలో ముందుంచాలని ఆయన పిలుపునిచ్చారు.
#BOIENA RAJESH
