రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.
మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో శనివారమే ఈ ప్రక్రియను చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62.76 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,725 కోట్లను అధికారులు పంపిణీ చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తున్నారు.
