Home South Zone Andhra Pradesh మదనపల్లెలో అంగన్‌వాడీల ధర్నా.. నాలుగో రోజుకు చేరిన దీక్షలు.

మదనపల్లెలో అంగన్‌వాడీల ధర్నా.. నాలుగో రోజుకు చేరిన దీక్షలు.

0

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి.

స్థానిక ఐసీడీఎస్ (ICDS) కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమను మోసం చేసిందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version