చీరాల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షతన గురువారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది.
నియోజకవర్గంలో ఓటర్ల నమోదు, సవరణలు మరియు తొలగింపు ప్రక్రియను బిఎల్వోలు (BLOs) అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారని ఆర్డీవో తెలిపారు.
ఇప్పటివరకు జరిగిన మార్పుల వివరాలను పార్టీలకు వివరించిన ఆయన, ఈ ప్రక్రియలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా, అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్ల (BLAs) జాబితాను మార్చి రెండో వారం లోపు విధిగా సమర్పించాలని స్పష్టం చేశారు.
#Narendra
