విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం పటమటలోని విశ్వవాణి స్కూల్, భారతీ నగర్లోని అనురాధ హాస్పిటల్ మరియు హైటెన్షన్ లైన్ ప్రాంతాల్లో విఎంసి ఫైర్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే విధానం, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్ల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించారు.
