విశాఖ జిల్లా శొంఠియాం ఆయుష్ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న గండి లూథియ పీబీ శనివారం (ఫిబ్రవరి 28) పదవీ విరమణ చేశారు.
1986లో విధుల్లో చేరిన ఆమె, గత 40 ఏళ్లుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిబద్ధతతో వైద్య సేవలు అందించారు.
1964లో జన్మించిన ఆమె తన పదవీ కాలం ముగియడంతో సహోద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది కొనియాడారు.
