శనివారం రాత్రి మదనపల్లి సమీపంలోని సి. టి. ఎం. వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నీరుగట్టువారిపల్లికి చెందిన చేనేత కార్మికులు వెంకటరమణ, రమేష్ తీవ్రంగా గాయపడ్డారు.
తరిగొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టింది. బాధితులను వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
