ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో రేషన్ కార్డుకు దరఖాస్తులు!
తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99 రోజుల పాటు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది.
రేషన్ కార్డుల కోసం నిరంతరం దరఖాస్తులు చేసుకునే ప్రక్రియను అమలు చేయనుంది. దీంతో కొత్తగా రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు.
