Home South Zone Telangana Stand with her

Stand with her

0

హైదరాబాద్‌లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహిళల పాత్ర కీలకమని ఆయన ఆకాంక్షించారు.


మహిళా భద్రతతో పాటు ఆర్థిక అభివృద్ధి కోసం ఇందిరమ్మ ఇండ్లు, అమెజాన్ వంటి సంస్థలతో మార్కెటింగ్ ఒప్పందాలు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

ముఖ్యంగా డీప్ ఫేక్ వంటి ఆన్‌లైన్ నేరాల నుండి మహిళలను కాపాడటమే తమ ప్రాధాన్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, చారు సిన్హా, మరియు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ పాల్గొని మహిళలకు బాసటగా నిలిచారు. ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవంతో మెలగాలని, ఆపదలో ఉన్న వారికి అండగా ఉండాలని ఈ క్యాంపెయిన్ పిలుపునిస్తోంది.

NO COMMENTS

Exit mobile version