అమరావతి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.10,100 కోట్ల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
#InternationalWomensDay
#ChandrababuNaidu
#AndhraPradesh
