దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా విద్య, సమాజ అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య ప్రాముఖ్యత కోసం ఆమె కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
