మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది.
ఈ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.
చెరువును వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అక్కడికక్కడే కాంట్రాక్టర్ను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఏ (SFA) వెంకటేష్, ఎంటమాలజీ విభాగం నుండి గణేష్, డోలి రమేష్, ప్రశాంత్, లింగారెడ్డి, శోభన్, రాజు మరియు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal
