రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. పూర్తిగా కంకర తేలిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నూతన రోడ్డును వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
