Home South Zone Andhra Pradesh రెండేళ్లుగా తిరుగుతున్నా.. కలెక్టరేట్ వద్ద తల్లీబిడ్డల రోదన.

రెండేళ్లుగా తిరుగుతున్నా.. కలెక్టరేట్ వద్ద తల్లీబిడ్డల రోదన.

0

మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్ (35)తో కలిసి నిరసన తెలిపారు. మనోహర్‌కు ప్రస్తుతం నెలకు రూ. 6 వేల పింఛన్ వస్తోంది.

అతని వైకల్య తీవ్రత దృష్ట్యా రూ. 15 వేల పింఛన్‌కు అర్హుడైనప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగలేదని, ఉన్నతాధికారులు స్పందించాలని ఆమె మీడియా సాక్షిగా వేడుకున్నారు.

NO COMMENTS

Exit mobile version