Home South Zone Andhra Pradesh Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్.

Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్.

0

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఆయన స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

ఇకపై ‘లీప్’ యాప్ మరియు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఎమ్మెల్యేలు వారానికోసారి పాఠశాలల్లో భోజనం చేయాలని లోకేశ్ సూచించారు.

NO COMMENTS

Exit mobile version