అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అభిషేకం, పుష్పాలతో అలంకరణ చేశారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు# కొత్తూరు మురళి.










