పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ టి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజశేఖర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత విశేషాలను, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు# కొత్తూరు మురళి.










