కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?
ప్రభుత్వంతో సమాంతరంగా పని చేస్తున్నామని భావిస్తున్నారా?
హైడ్రా మీద మరోసారి నిప్పులు చెరిగిన హైకోర్టు
కోర్టు వివాదంలో ఉన్న స్థలం ఆక్రమించడంపై హైడ్రా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
మేడ్చల్ జిల్లా సూరారం గ్రామంలో తన రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకుని, బోర్డులు ఏర్పాటు చేశారని హైడ్రాకు వ్యతిరేకంగా జితేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన న్యాయమూర్తి
హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, అర్దరాత్రి స్తలం వద్దకు చేరుకుని, ప్రభుత్వ స్థలం అంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసిందని మరోసారి హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
బాధితుడి తరపు న్యాయవాది వాదనలు విని, “హైడ్రా కోర్టులు, ప్రభుత్వానికి అతీతమా, కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?” అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు
ప్రభుత్వంతో సమానంగా పనిచేస్తూ కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని, ఇలాగే చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హైకోర్టు హెచ్చరిక
ఆ స్థలం స్వాధీనం చేసుకోమని రెవెన్యూ, మున్సిపల్ శాఖలు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ, 48 గంటల్లో బోర్డులు తీసివేయాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు










