మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ్, శ్రీనివాస్ వర్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి గౌరవ నివాళులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, కార్తీక్ గౌడ్, రామ్ మోహన్, అనిల్ కుమార్, మైపాల్ రెడ్డి, చందిల్, సచిన్ తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
జయంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడి, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ కి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.
#sidhumaroju
Alwal










