చీరాల
భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి సందర్భంగా చీరాల ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఎస్ఎంసి. చైర్మన్ దగ్గుబాటి రాంబాబు ఆధ్వర్యంలో అత్యంత గౌరవప్రదంగా నిర్వహించడం జరిగింది.
మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దగ్గుబాటి రాంబాబు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన సమాజానికి అందించిన సేవలు, ముఖ్యంగా అణగారిన వర్గాల సాధికారత కోసం చేసిన పోరాటం గురించి ప్రస్తావించారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యలో, సామాజిక సేవలో ముందుకు సాగాలని సూచించారు.అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించి, రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానీయుడిగా ఆయనను కొనియాడారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ వేడుకలలో ఎస్ఎంసి. మెంబర్ హేమచంద్ర శ్రీనివాస్, పాఠశాల కంప్యూటర్ టీచర్ మహేష్ ,స్టడీ టీచర్ భవాని, వాచ్ మెన్ శ్రీనివాసరావు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.










