మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. డీసీపీ చౌ. శ్రీధర్ ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్పేట్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.
ఈ మెరుపు దాడుల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 100 ఆక్సిటోసిన్ బాటిల్స్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మరియు ఒక హుక్కా పాట్ను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల అనంతరం అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచేందుకు, డ్రగ్స్ మరియు ఇతర చట్టవిరుద్ధ పనులను అరికట్టేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు.
స్థానిక పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.
#sidhumaroju
Alwal









