గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*

0
9

చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కళాశాల విద్యార్దులచే ముఖ్యమైన చట్టాలను గురించి వివరించారు, ముఖ్యముగా ఫోక్షో చట్టం, లోకదలత్, ఆర్ టి ఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తదితర ముఖ్యమైన చట్టాల గురించి గ్రామస్తులకు వివరించారు. పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందకరమని,

ఎక్కువ గ్రామాలలో ప్రజలే పోలీస్ స్టేషన్లో అవగాహన లేక కేసుల్లో నిందితులుగా బాధ్యతలు అవుతారని చట్టాలన్నీ వివరించడం వల్ల గ్రామ ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ డా.కె.నరసింగరావు,సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణారావు,రేటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుంకర సాయిబాబు,కళాశాల ప్రిన్సిపల్ నటరాజ కుమార్, ముఖ్య అతిథులు గా చీరాల మండల ఎమ్మార్వో గోపికృష్ణ, చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ ,గ్రామ సెక్రటరీ నీలిమ,కళాశాల విద్యార్థులు పాల్గొని చట్టాలు సామాన్య ప్రజలు తెలుసుకోవడం అవసరమని తెలియచేశారు .