వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు
అభినవ మేల్కోటగా పేర్గాంచిన కృష్ణాజిల్లా దివిసీమ కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో కోలువైఉన్న శ్రీమన్నారాయణ స్వామి వారి దేవాలయoలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞ కార్యక్రమాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమైనాయి.
ఆలయ నిర్వాహకులు అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శటగోపాముని రామానుజ జీయర్, మేల్కొటే , కర్ణాటక శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రంగ రామానుజ జీయర్, భీమవరం శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామి వార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞ కార్యక్రమాలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు ప్రారంభించారు
త్రిదండి అష్టాక్షరీ రామానుజ జీయర్ స్వామి వారు ఎమ్మెల్యే దంపతులకు సాదర స్వాగతం పలికారు
అనంతరం శ్రీ విశ్వక్సేన ఆరాధనమూ తదితర పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు స్వామి వారు ఎమ్మెల్యేకి ఈ పది రోజులు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు
ఈ కార్యక్రమంలో బూరగడ్డ హరనాథ్ బాబు, మద్దాలి ప్రసాదు, అన్నం సురేంద్రనాథ్, యోగానంద్, కోట వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










