ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఘంటసాల మండలం యండకుదురులో ప్రముఖంగా ఉన్న దేవాలయాలైన హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామాలయంలో, మరియు గ్రామ దేవత అయిన శ్రీ లక్ష్మీ నాంచారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగినది. భోగభాగ్యాలను వదిలి మానవసేవే మాధవసేవ గా భావించి రాజకీయాల్లోకి వచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పరిపూర్ణ ఆరోగ్యము రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎండకుదురు సెగ్మెంట్ ఎంపీటీసీ సిద్దినేని కుమార్ రాజా గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కోలపల్లి శ్రీవర్షగారు, మండల ఉపాధ్యక్షులు కోలపల్లి కిరణ్ గారు, కొత్తపల్లి లక్ష్మీ పెరుమాళ్ళు గారు, సిద్ధినేని సుబ్బారావు గారు వారి మరియు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు పత్తిపాటి నాగరాజు గారు, బూరగడ్డ ప్రదీపు, ఏనుగు పాండురంగారావు గారు, రామాంజనేయులు గారు మరియు అభిమానులు పాల్గొన్నారు.










