మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.

0
36

చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా ఆపరేటర్ యజమాని రేపాల చంద్రశేఖర్ ను ఆదుకోవాలని TMOA జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొట్టిపర్తి శ్రీకాంత్, మండవ వీరబాబు కోరారు. మంగళవారం చంద్రశేఖర్ మీసేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రమాద తీరును, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. మీసేవా యజమాని చంద్రశేఖర్ కు మీసేవా ఆపరేటర్లు అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి చంద్ర శేఖర్ కు బాసటగా నిలవాలన్నారు. వారి వెంట మీసేవా ఆపరేటర్లు, స్థానిక నాయకులు ఉన్నారు.