మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ఇతర నాయకులు బోధి శ్రీనివాస్, సూర్య, ఉషా తదితరులు హాజరై కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
మే 10న జరిగే ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నేతలు ఆకాంక్షించారు.
#Sidhumaroju
Alwal










