అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట

0
5

రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు.

పంట నాశనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.