హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు.
కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు.
అయినప్పటికీ, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
“ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు” అని పేర్కొన్న సీఎం, మే 8న బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసేముందే బండి భగీరత్ ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ప్రస్తుతం కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు.
#Sidhumaroju










