సరిహద్దులు దాటుతున్న చింతూరు “ఆకు” కష్టాలు.

0
4

చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే ప్రభుత్వ సహకారం మాత్రం కరువైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల గిరిజన జీవనోపాధి ఇప్పుడు ‘నది’ దాటి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

గతంలో చింతూరు కేంద్రంగా సాఫీగా సాగిన తునికాకు (బీడీ ఆకు) సేకరణ, ఇప్పుడు అధికారుల పట్టింపులేమితో అటకెక్కింది.ఇక్కడ కొనేవారు లేక, గిరిజనులు తాము సేకరించిన ఆకును పడవల్లో నింపుకుని, ప్రమాదకరమైన సీలేరు నదిని దాటి ఒడిశాకు వెళ్తున్నారు.తమ ప్రాంతంలోనే గిట్టుబాటు ధర దక్కాల్సిన చోట, ప్రాణాలు పణంగా పెట్టి పక్క రాష్ట్రంలో అమ్ముకోవాల్సి రావడం శోచనీయం.ఇకనైనా  చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.

# Yadagiri