పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారం – ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి

0
4

చీరాల

చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు దోగుపర్తి వెంకట సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ (శుక్రవారం) ఉదయం 8:00 గంటలకు స్థానిక మునిసిపల్ ఓపెన్ థియేటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎం.ఎం. కొండయ్య హాజరై, విద్యార్థులకు పురస్కారాలను అందజేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు దోగుపర్తి వెంకట సురేష్, పోలుదాసు రామకృష్ణ చారగుళ్ళ గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. చీరాల, వేటపాలెం మండలాల్లోని అన్ని పాఠశాలల నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులు 9866137914 అనే ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు.