అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు: ఎస్పీ.

0
1

అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీస్ అధికారులకు గురువారం ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. మదనపల్లెలో జరిగిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి కేసుల్లో నిందితులపై హిస్టరీ షీట్లు ప్రారంభించాలని ఆదేశించారు.