డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.

0
4

మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత మూడేళ్లుగా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని కాలనీ వాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీ కాలువలు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ ప్రజలు కోరారు.