మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 135వ (old) డివిజన్ కనాజిగూడ ఇంద్రనగర్ కాలనీ మెయిన్ రోడ్డులోని పెండింగ్ పనుల సమస్యను స్థానికులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వివరించారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంద్రనగర్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీలోని డ్రైనేజీ సీవరేజ్ లైన్, వాటర్ లైన్ సమస్యలను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ నాయకులు సంతోష్ సాగర్, కంటెస్టెంట్ కార్పొరేటర్ సంజీవ కుమార్, ఏ బ్లాక్ అధ్యక్షులు శేఖరం, డివిజన్ అధ్యక్షులు సుదేశ్ చంద్, మల్లెల శివ, సంజు గౌడ్, ఉదయ్ కుమార్, లడ్డు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, శివకుమార్, కిట్టు, బల్వంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
అలాగే డివిజన్ నాయకులు రాజన్, రాజకుమార్, జోసఫ్, రాము, మల్లేష్ యాదవ్, బాల నరసింహ, అంకుల్ రాజేందర్, కుమార్, మహిళా నాయకురాళ్లు పద్మ, లక్ష్మి, మీనా తదితరులు ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యారు.
#Sidhumaroju
Alwal










