రామాయంపేటలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు







