మదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. నాలుగు వారాల కార్యాచరణలో భాగంగా మున్సిపల్ అధికారులు, కార్మికులు పట్టణంలో చెత్త తొలగింపు చేపట్టారు.
చెత్త వేస్తే జరిమానాలు, షాపుల సీజింగ్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.









