డిజిటల్ మహానాడును జయప్రదం చేయండి: ఎమ్మెల్యే.

0
4

మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో డిజిటల్ పద్ధతిలో జరగబోయే ఈ మహానాడులో పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.