మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, పాత లీజుదారులు సిండికేట్గా మారి, బినామీల పేర్లతో పదుల సంఖ్యలో షాపులు దక్కించుకుని మూడో వ్యక్తికి సబ్-లీజుకు ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను సొంత పేర్లకు మార్చుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ జరిపి, రిజర్వేషన్ల ప్రకారం పారదర్శకంగా పునఃవేలం నిర్వహించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.










