రణస్థలం మండలం నెలివాడ సమీపంలోని NH-16పై సోమవారం ప్రమాదం జరిగింది. పూసపాటిరేగ మండలం గుణపురెడ్డిపాళెంకు చెందిన శ్రావణ్ కుమార్ (39) బైక్పై తన భార్యను రణస్థలంలోని ఓ స్కూల్లో దించి తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. కారు అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Boiena Rajesh










