మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ. 21 కోట్లు మంజూరు చేసింది. అమృత్ 2.0 పథకం కింద, వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీం కోసం చిప్పిలి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ సప్లై పనులకు మంగళవారం భూమి పూజ జరిగింది. ఈ పనులను జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శివ నారాయణ శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.










