అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ తన భార్య రాజ్యలక్ష్మి తలపై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి# తురుమురళి .










