శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల్లో ఉద్రిక్తతలు, సామాజిక విభేదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉండే వివాదాస్పద చిత్రాలు, అభ్యంతరకరమైన వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్స్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్రించరాదని సూచించారు.
ముద్రణకు ముందు అందిన డిజైన్లు, సందేశాలు, చిత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, చట్టాలకు అనుగుణంగా ఉన్న వాటినే ముద్రించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ఫ్లెక్స్లు, బ్యానర్లు ముద్రించినా లేదా సరఫరా చేసినా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలందరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.










