కైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే మాధవరం డిమాండ్

0
4

హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేద కుటుంబాలకు, అలాగే నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులకు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరిని కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల అమృత్‌నగర్ తండాకు చెందిన 62 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు.

మిగిలిన ఇళ్లను కైతలాపూర్ పరిసర ప్రాంతాల పేద, అర్హులైన కుటుంబాలకు కేటాయించడంతో పాటు, సొంత ఇళ్లు లేని పాత్రికేయులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా గృహ వసతి కల్పించాలని సూచించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకుడు తులసిరావు తదితరులు పాల్గొన్నారు