పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఒక సంవత్సరంలోనే మూడుసార్లు పూడికతీత పనులు చేయడం కాంట్రాక్టర్లకు ఆదాయం చూపించడమేనని, వర్షం పడగానే మట్టి తిరిగి కాలువలో పడి పేరుకుపోతుందని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని వారు తెలిపారు. వెంటనే మున్సిపల్ ప్రత్యేక అధికారి ఈ పనులను పరిశీలించి, జరుగుతున్న అవినీతిపై పూర్తి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.










