ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుండగా అది పాలుగా మారుతున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు.
ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, శివాలయం వద్ద భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.










