నిజామాబాద్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

0
2

తేదీ: 02.06.2026

నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు, శ్రీ జీవన్ రెడ్డి గారు, శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శ్రీ వీజీ గౌడ్ గారు జాతీయ జెండా మరియు పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం వినాయక్ నగర్‌లోని అమరవీరుల పార్క్‌కు చేరుకుని తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్,సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్,మతీన్ మరియు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.