మహిళల భద్రతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యం టిడిపి రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్

0
3

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిఐజి కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అధ్యక్షత వహించారు అర్బన్ సీఐ వెంకట చలపతి ఎస్సై అబ్దుల్ జహీర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా రాయచోటి సిఐ వెంకట చలపతి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ను ప్రతి మహిళా తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు అత్యవసర పరిస్థితులు యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుందని తెలిపారు మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చేపడుతుందని అన్నారు ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు బెట్టింగ్ యాప్లు ప్రమాదంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది టిడిపి నాయకులు సుబ్బయ్య నాయుడు ఆంజనేయ నాయుడు శివప్రసాద్ పెద్దలు పోలీస్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు