కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. మహానాడులో మంత్రి లోకేశ్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో, మహిళలతో కలిసి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.










