మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్లోని ధోబీఘాట్ ప్రాంతంలో కొత్త బోర్వెల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అరుణ్, అంజయ్య, మహేష్, యాదగిరి, ప్రేమ్, సాజిద్, సత్యనారాయణ, వర్ణిక, వెంకటమ్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.
ప్రాంత ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ బోర్వెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అల్వాల్ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
#Sidhumaroju
Alwal










