హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా విజ్ఞప్తి మేరకు ఈ సేవను మంజూరు చేయించి శనివారం ఉదయం మండలకేంద్రంలో ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఈ సౌకర్యం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, చిరు వ్యాపారులకు, పట్టణాలకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని కొన్ని గ్రామాల మధ్య సరైన ప్రభుత్వ రవాణా లేకపోవడం వల్ల గతంలో ప్రజలు ఆటోలు.
ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని దీని వలన ఖర్చు, సమయం అధికంగా ఉండేదని కావున సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఈ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు,కావున ప్రజలు ఆర్టీసీ సేవలను వియోగించుకుని తద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లి తమ వంతు సహకారాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, M.P.D.O ఫణిచంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చల్లా చక్రపాణి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్, మస్కే కుమార్ తదితరులు పాల్గొన్నారు.










